Somu Veerraju: టీడీపీ కంటే బీజేపీకే ఆదరణ

ABN , First Publish Date - 2022-08-07T23:05:33+05:30 IST

ఏపీ రాజకీయాల్లో (Ap Politics) బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు (Bjp State President Somu Veerraju) అన్నారు. బీజేపీ...

Somu Veerraju: టీడీపీ కంటే బీజేపీకే ఆదరణ

అమరావతి (Amaravathi): ఏపీ రాజకీయాల్లో (Ap Politics) బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు (Bjp State President Somu Veerraju) అన్నారు. బీజేపీ ముఖ్య నాయకులతో సోమువీర్రాజు ఆడియో కాన్ఫెరెన్స్ (Audio Conference) నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో బీజేపీ చేపట్టిన  ఉద్యమాలకు ప్రజల మద్దతు ఉందని ఆయన తెలిపారు. బీజేపీ యువమోర్చా (Yuva morcha) చేపట్టిన ‘యువ సంఘర్షణ యాత్ర’ (Yuva Sangharshana Yatra) విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఈ నెల 4న ప్రారంభమైన యాత్రకు పలు జిల్లాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఇదే ఉత్సాహంతో అన్ని ప్రాంతాల్లో యాత్ర కొనసాగించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కంటే  బీజేపీకే ప్రజల ఆదరణ పెరిగిందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బీజేపీ ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని సోము వీర్రాజు తెలిపారు. 

Updated Date - 2022-08-07T23:05:33+05:30 IST