ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి: సోము
ABN , First Publish Date - 2020-12-03T08:59:33+05:30 IST
‘‘మన లక్ష్యం ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే. ప్రజాసమస్యలపై ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పోరాడాలి. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న
అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘‘మన లక్ష్యం ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే. ప్రజాసమస్యలపై ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పోరాడాలి. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితిపై ఈనెల 5న బీజేపీ ఆందోళన చేపడుతోందన్నారు. ఆరవ తేదీన అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.