సిద్దరామయ్యకు జైలు తప్పదు..
ABN , First Publish Date - 2022-05-08T17:44:53+05:30 IST
అర్కావతి డీ నోటిఫికేషన్కు సంబంధించి అవినీతి తేలితే ప్రతిపక్షనేత సిద్దరామయ్య జైలుకు వెళ్లకు తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్కుమార్ కటీల్ పేర్కొన్నారు. తుమకూరులో శనివారం ఆయన
- Bjp రాష్ట్ర అధ్యక్షుడు నళిన్కుమార్ కటీల్
బెంగళూరు: అర్కావతి డీ నోటిఫికేషన్కు సంబంధించి అవినీతి తేలితే ప్రతిపక్షనేత సిద్దరామయ్య జైలుకు వెళ్లకు తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్కుమార్ కటీల్ పేర్కొన్నారు. తుమకూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల అక్రమాలలో 80 శాతం మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉన్నారన్నారు. అవినీతి, అక్రమాలు కాంగ్రెస్ కు రెండు ముఖాలని పేర్కొన్నారు. అత్యంత ఎక్కువ అక్రమాలు జరిగింది సిద్దరామయ్య పాలనలోనే అన్నారు. కోట్లాది రూపాయల హుబ్లాట్ వాచ్ను ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య తీసుకున్నారంటే ఇక అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. తలగడలలోనూ దిగమింగిన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి విషయం తెలియదా అన్నారు. అర్కావతి డీ నోటిఫికేషన్లో కెంపణ్ణ కమిషన్ నివేదిక బయటకు వస్తే సిద్దరామయ్య జైలుకు వెళతారన్నారు. ప్రియాంక ఖర్గే ఎస్ఐ పోస్టుల అక్రమాలపై రోజూ మాట్లాడారని, ఆయన తండ్రి ఎలా సంపాదించారో బహిరంగంగా చెబితే బాగుంటుందన్నారు. హిట్ అండ్ రన్ ఆరోపణలు కాదని వాస్తవాలు ఆధారాలతో చెబితే దర్యాప్తు మరింత తీవ్రంగా సాగుతుందన్నారు. డీజే హళ్లి, హుబ్బళ్లిలో మత ఘర్షణలను సిద్దరామయ్య, డీకే శివకుమార్ ప్రోత్సహించారని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మత ఘర్షణలు అదుపులో ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం వెంటాడుతుండడంతో కుతంత్రాలకు పాల్పడుతోందన్నారు.