నేను రెచ్చగొట్టుడు ప్రారంభిస్తే... బండి సంజయ్
ABN , First Publish Date - 2021-09-16T03:33:41+05:30 IST
"నేను రెచ్చగొట్టుడు ప్రారంభిస్తే" తట్టుకోవటం
కామారెడ్డి: "నేను రెచ్చగొట్టుడు ప్రారంభిస్తే" తట్టుకోవటం కేసీఆర్ తరం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కామారెడ్డిలో జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన మాట్లాడారు. అనేక మంది త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రంలో మూర్ఖుడు పాలన కొనసాగిస్తున్నాడన్నారు. కేసీఆర్ నాలుగు గంటలు పనిచేసి 20 గంటలు పడుకుంటారని ఆరోపించారు.
వరి వేస్తే ఎందుకు ఉరి వేసుకోవాలో కేసీఆర్ను రైతులు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపై లక్ష రూపాయల అప్పు చేసిన దుస్థితి టీఆర్ఎస్ది అని ఆయన ఆరోపించారు. గడీల పాలనకు కాపలాదారుగా రాష్ట్ర హోంమంత్రి ఉన్నారని సంజయ్ అన్నారు. గడీలను బద్దలు కొట్టి గులాబీ పార్టీని తరిమి కొడతామని బండి సంజయ్ పేర్కొన్నారు.