ప్రభుత్వాన్ని కూల్చడం మా లక్ష్యం కాదు

ABN , First Publish Date - 2022-06-02T13:09:49+05:30 IST

తాము విడుదలచేసే అవినీతి చిట్టా చూసిన తర్వాత అయినా డీఎంకే నేతల్లో మార్పు రావాలన్నదే తమ ఆలోచన తప్ప.. ఆ ప్రభుత్వాన్ని కూల్చడం తమ

ప్రభుత్వాన్ని కూల్చడం మా లక్ష్యం కాదు

                        - Bjp State President అన్నామలై 


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 1: తాము విడుదలచేసే అవినీతి చిట్టా చూసిన తర్వాత అయినా డీఎంకే నేతల్లో మార్పు రావాలన్నదే తమ ఆలోచన తప్ప.. ఆ ప్రభుత్వాన్ని కూల్చడం తమ లక్ష్యం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు. తిరుచ్చిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. 2014 నుంచి పేదలకు 52 లక్షల ఇల్లు నిర్మించడంతో పాటు 2024లోగా అన్ని గృహాలకు తాగునీటి కనెక్షన్ల అందించే బృహత్తర పథకం చేపట్టామన్నారు. ఆధార్‌-రేషన్‌ కార్డులను అనుసంధానం చేయడంతో ద్వారా 4 కోట్ల నకిలీ రేషన్‌కార్డులు తొలగించామని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని, రాష్ట్ర పోలీసు శాఖ అధికార పార్టీ నేతల చేతుల్లో బందీగా ఉందని ఆరోపించారు. ఏడాది పాలనలో అవినీతి చోటుచేసుకుందని, రాబోయే రెండేళ్లలో మరింత అవినీతి జరిగే అవకాశముందన్నారు. అధికార డీఎంకే పాల్పడుతున్న అవినీతిపై ఫిర్యాదులకు ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబరు పరిచయం చేయాలని అన్నామలై ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-06-02T13:09:49+05:30 IST