హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
ABN , First Publish Date - 2021-11-26T16:34:22+05:30 IST
హైదరాబాద్: హుజురాబాబ్ విజయంతో కమలనాథులు మంచి జోష్లో ఉన్నారు.
హైదరాబాద్: హుజురాబాబ్ విజయంతో కమలనాథులు మంచి జోష్లో ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఊపు కొనసాగించాలని వ్యూహం రచిస్తోంది. శుక్రవారం నుంచి పాతబస్తీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన పాతబస్తీలోని మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాష్ట్ర పదాధికారులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. ఈ భేటీకి శాసనసభా పక్షనేత రాజాసింగ్, డీకే అరుణ, లక్ష్మణ్, పొంగులేటి, విజయశాంతి, వివేక్, ప్రధాన కార్యదర్శులు, ఇంద్రసేనారెడ్డి, ఎంపీ సోయం బాపూరావు తదితరులు హాజరయ్యారు. కాగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి బండి సంజయ్ పూలమాల వేసి నివాళులర్పించారు.