రాం, రహీం మధ్య విధ్వేషాలు: బీజేపీ లాలూ ఫైర్

ABN , First Publish Date - 2021-10-06T01:45:17+05:30 IST

బీజేపీకి రాజకీయాలంటే విధ్వేషాలు రెచ్చగొట్టడమే. రాం, రహీం భక్తుల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. దీని రుచి గురించి వాళ్లకు బాగా తెలుసు. అల్లర్లను ప్రేరేపించి, హింసను పెంచి వాళ్లు అధికారంలోకి వస్తారు. కానీ ప్రతి దానికి ఒక ముగింపు, హద్దు ఉంటుంది..

రాం, రహీం మధ్య విధ్వేషాలు: బీజేపీ లాలూ ఫైర్

పాట్నా: రాం, రహీం భక్తుల మధ్య భారతీయ జనతా పార్టీ విధ్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తోందని రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న ప్రతిదానికి మూల్యం ఉంటుందని హెచ్చరించారు. ప్రజలు తొందరలోనే వీటన్నిటినీ అర్థం చేసుకుని బీజేపీకి చెక్ పెడతారని లాలూ పేర్కొన్నారు.


‘‘బీజేపీకి రాజకీయాలంటే విధ్వేషాలు రెచ్చగొట్టడమే. రాం, రహీం భక్తుల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. దీని రుచి గురించి వాళ్లకు బాగా తెలుసు. అల్లర్లను ప్రేరేపించి, హింసను పెంచి వాళ్లు అధికారంలోకి వస్తారు. కానీ ప్రతి దానికి ఒక ముగింపు, హద్దు ఉంటుంది. బీజేపీ కుటిల రాజకీయాలను ప్రజలు తొందరలోనే అర్థం చేసుకుంటారు, కాషాయ పార్టీకి గట్టి జవాబు ఇస్తారు’’ అని లాలూ అన్నారు. ఇక బీజేపీ అధికారంలో ఉండడానికి గల మరో కారణాన్ని వివరిస్తూ ‘‘కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఏవీ ఒక తాటికి రాలేకపోతున్నాయి. మేము చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యాం. అందుకే బీజేపీ అధికారంలో ఉండగలుగుతోంది’’ అని అన్నారు.

Updated Date - 2021-10-06T01:45:17+05:30 IST