Har Ghar Tiranga: బీజేపీ సౌత్ సెల్ ఆధ్వర్యంలో ‘ఘర్ ఘర్ కా జెండా’

ABN , First Publish Date - 2022-08-10T01:35:20+05:30 IST

బీజేపీ సౌత్ సెల్ ఆధ్వర్యంలో నేడు ముంబైలో ఘర్ ఘార్ కా జెండా అవగాహన ప్రచార సభ జరిగింది.

Har Ghar Tiranga: బీజేపీ సౌత్ సెల్ ఆధ్వర్యంలో ‘ఘర్ ఘర్ కా జెండా’

ముంబై: బీజేపీ సౌత్ సెల్(BJP South Cell) ఆధ్వర్యంలో నేడు ముంబై (Mumbai)లో ఘర్ ఘర్ కా జెండా అవగాహన ప్రచార సభ జరిగింది. ప్రముఖ కవి యెల్ది సుదర్శన్ పద్మశాలి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వృద్ధులకు గొడుగులను పంపిణీ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కెప్టెన్ తమిళ్ సెల్వన్ తోడ్పాటుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా వృద్ధులకు గొడుగుల పంపిణీ చేపట్టారు. బీజేపీ సౌత్ సెల్ అధ్యక్షులు ముత్తుకృష్ణన్, జనరల్ సెక్రెటరీ ఎనుగందుల రవి అధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేక గంగాధర్, సెక్రెటరీలు మేక శ్రీకాంత్, రాపెల్లి రాజ్ పాల్, కారంపురి మనోహర్, దామోదర్ పడాల, ఎనుగందుల అక్షిత, తేజశ్రీ దోర్నాల, సుజాత ద్యావర్ శెట్టి, శైలజా గురుడు సహా పలువురు పాల్గొన్నారు.


ఈ కార్యక్రమానికి ముంబై సెక్రెటరీ సచిన్ శిందే స్పాన్సర్‌గా వ్యవహరించారు. శిందే గత నెలలో సౌత్ సెల్ వారి కోసం వజ్రేశ్వర్‌ దేవీ మందిర దర్శనం టూర్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. వనభోజన ఏర్పాట్లు, 200 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ, కాంగార్ స్టేడియం ఎదురుగా ఉన్న పోచమ్మ దేవీ ఆలయం వద్ద 200 మందికి పైగా మహిళలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు.











Updated Date - 2022-08-10T01:35:20+05:30 IST