బటన్ నొక్కడమే పనిగా ప్రభుత్వం పని చేస్తుంది: సోమువీర్రాజు
ABN , First Publish Date - 2022-08-16T17:39:07+05:30 IST
బటన్ నొక్కడమే పనిగా ప్రభుత్వం పని చేస్తుంది: సోమువీర్రాజు
విజయవాడ: నేచుర్ క్యూర్ ఆస్పత్రికి గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని బీజేపీనేత సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బటన్ నొక్కడమే పనిగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధులను సొంత ఖాతా నుంచి ఇచ్చినట్లు బటన్ నొక్కుతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈనెల 21 విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు బీజేపీనేత సోమువీర్రాజు తెలిపారు.