యూపీలో బీజేపీకే ఘన విజయం!
ABN , First Publish Date - 2022-03-10T06:54:46+05:30 IST
ఎన్నికల ఫలితాల ముంగిట మరో సంస్థ ఎగ్జిట్ పోల్
- మరో ఎగ్జిట్ పోల్లో వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 9: ఎన్నికల ఫలితాల ముంగిట మరో సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించింది. లోక్నీతి-సీఎ్సడీఎస్ సంస్థలు జరిపిన సర్వేలో యూపీలో బీజేపీ 43శాతం ఓట్లతో ఘన విజయం సాధించనున్నట్లు తేలింది. 2017లో ఇదే శాతం ఓట్లతో బీజేపీకి 300 సీట్లు వచ్చాయి. ఎస్పీకి 35 శాతం, బీఎస్పీకి 15 శాతం, కాంగ్రె్సకు 3 శాతం ఓట్లు రానున్నాయి. పంజాబ్లో 40% ఓట్లతో ఆప్ ఘన విజయం సాధించనుండగా, కాంగ్రె్సకు 26%, ఆకాలీదళ్కు 20% ఓట్లు రానున్నాయి. గోవాలో బీజేపీకి 32%, కాంగ్రె్సకు 29%, తృణమూల్ కాంగ్రె్సకు 14%, ఆప్నకు 7% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్లోనూ భాజపాకే కాస్త మొగ్గు కనిపిస్తోంది.