బీజేపీ బహిరంగ సభను జయప్రదం చేయాలి
ABN , First Publish Date - 2022-07-03T05:59:22+05:30 IST
బీజేపీ బహిరంగ సభను జయప్రదం చేయాలి
ఆమనగల్లు/ఆదిభట్ల/ జూలై 2: బీజేపీ బహిరంగ సభను జయప్రదం చేయాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి పిలుపునిచ్చారు. ఆమనగల్లు పట్టణంలో శనివారం విజయ సంకల్ప సభ విజయవంతంమై బీజేపీ శ్రేణులతో ఆచారి సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ సభ విజయవంతం, జనసమీకరణ గురించి చర్చించారు. అభిమానులు ఉప్పెనలా కదలాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా అదేవిధంగా ఆదిభట్ల పరిధి బొంగులూర్లో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కొత్త అశోక్గౌడ్ విజయసంకల్ప యాత్రను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. టీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలన్నారు.