రహదారుల దుస్థితిపై బీజేపీ ఆందోళన
ABN , First Publish Date - 2020-12-06T04:56:15+05:30 IST
ప్రధాన రహదారులు అధ్వాన స్థితిలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు నిరసన తెలిపారు.
పాలకొల్లు అర్బన్/రూరల్, డిసెంబరు 5: ప్రధాన రహదారులు అధ్వాన స్థితిలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. యడ్ల బజారు నుంచి ఆచంట రహదారిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జక్కంపూడి కుమార్ ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. మండలంలో దిగమర్రు బైపాస్రోడ్డు గూడపాటి బాబీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాండూరి రవి, నాయకులు బాదిన విజయకుమార్, పిన్ని కిషోర్ కుమార్, శీలం పార్దు, గుణ్నం సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
భీమవరం రూరల్ : మండలంలో రహదారులు అధ్వానంగా ఉన్నా యని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలో రాట్నాల సత్యనారాయణ, తోట గంగరాజు, సోము సత్యనారాయణ, బుంగ బుచ్చమ్మ పాల్గొన్నారు.