మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం: Bundi Sanjay
ABN , First Publish Date - 2022-05-14T01:10:12+05:30 IST
అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bundi Sanjay) ప్రకటించారు.
రంగారెడ్డి: బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bundi Sanjay) ప్రకటించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని నాగులదోని తండా, దయ్యాల గుండు తండా, మహేశ్వరం గ్రామంలో ప్రజా సంగ్రామయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ హిందూ కులవృత్తులను సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. గిరిజన తండాలకు కేసీఆర్ ప్రభుత్వం నిధులు కేటాయించకుండా విస్మరించిందని మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. భాగ్యనగరంలో ఉన్న హిందూ సమాజాన్ని ఏకం చేసి ఎంఐఎంకు బుద్ధి చెబుతామని బండి సంజయ్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గానికి ఇచ్చిన నిధులపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని సంజయ్ సవాల్ చేశారు.