మళ్లీ మాదే అధికారం: బీజేపీ అధినేత నడ్డా

ABN , First Publish Date - 2021-09-11T22:15:51+05:30 IST

యూపీ ఎన్నికలపై చేసిన సర్వేలు కూడా ఇదే మాట చెబుతున్నాయని, బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని ఆయన అన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మళ్లీ మాదే అధికారం: బీజేపీ అధినేత నడ్డా

న్యూఢిల్లీ: వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు. యూపీ ఎన్నికలపై చేసిన సర్వేలు కూడా ఇదే మాట చెబుతున్నాయని, బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని ఆయన అన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కులతత్వం, మతతత్వం, వారసత్వం, రాచరికం అన్నీ అంతమొందాయి. వీటిన్నిటినీ దాటి దేశంలో అభివృద్ధి ముందుకు వచ్చింది. మోదీ నాయకత్వంలో 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 325 స్థానాలను గెలుచుకుంది. అలాగే 2014, 2019 సాధారణ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీజేపీనే గెలిచింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుంది. మరోసారి యూపీలో కమల ప్రభుత్వమే ఏర్పడుతుంది’’ అని నడ్డా అన్నారు.

Updated Date - 2021-09-11T22:15:51+05:30 IST