సంకల్ప సభకు తరలిన బీజేపీ శ్రేణులు
ABN , First Publish Date - 2022-07-04T04:22:26+05:30 IST
ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభకు నారాయణ పేట జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు తరలివెళ్లారు.
నారాయణపేట, జూలై 3 : ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభకు నారాయణ పేట జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు తరలివెళ్లారు. బీజేపీ నాయకులు రతంగ్ పాండురెడ్డి, జలంధర్రెడ్డి, కొండయ్య, సత్యయాదవ్, ప్రభాకర్వర్ధన్, రఘురామ య్య, మల్లేష్, వెంకట్రాములు, నందు నామాజీ, లక్ష్మణ్ తరలివెళ్లిన వారిలో ఉన్నారు.
నారాయణపేట రూరల్ : ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన ప్రధాని మోదీ హాజరయ్యే విజయ సంకల్ప సభకు మండలంలోని భైరంకొండ, ఎక్లాస్పూర్, జలాల్పూర్, పేరపళ్ళ, జాజాపూర్, కోటకొండ, కొల్లంపల్లి, సింగారం గ్రామాల నుంచి బీజేపీ శ్రేణులు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్ళారు. సింగారంలో మాజీ సర్పంచ్ నాగిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఉప సర్పంచ్ సిద్దప్ప, నగేష్, చంద్రారెడ్డి, చింతలయ్య, జయతీర్థాచారి, బాలప్ప, రవి, మల్లప్ప, వెంకటప్ప తరలివెళ్లారు.
మరికల్ : హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో చేప ట్టిన బహిరంగ సభకు ఆదివారం బీజేపీ మండలాధ్యక్షు డు భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని అప్పంపల్లి, ఎల్లిగండ్ల, మరికల్ గ్రామాల నుంచి బీజేపీ శ్రేణులు తరలి వెళ్లారు. వేణుగోపాల్, వెంకటేష్, తిరుపతిరెడ్డి, శ్రీరామ్, జానకి తరలి వెళ్లారు.
నర్వ : హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ మండలాధ్యక్షుడు రవీం దర్రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఆంజనేయులు, నరేందర్రెడ్డి, నరసింహ రెడ్డి, కిష్టప్ప, పెద్ద వెంకట్రెడ్డి, పుత్ర శేన, శరత్బాబు, బొజ్జన్న, అయ్యన్న తరలివెళ్లిన వారిలో ఉన్నారు.
ధన్వాడ : హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు మం డల కేంద్రంతోపాటు కంసాన్పల్లి, మందిపల్లి, కొండా పూర్, కిష్టాపూర్, చర్లపల్లి, పాతపల్లి గ్రామాల నుంచి బీజేపీ నాయకులు ప్రత్యేక వాహనాల్లో వెళ్లారు. మాజీ వైస్ ఎంపీపీ రాంచంద్రయ్య, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జట్రం గోవర్ధన్గౌడ్, సుంకు ఉమేష్కుమార్ గుప్తా, అంజియాదవ్, చాకలి బాల్రాజు, కురుమూర్తి, చక్రి తరలివెళ్లిన వారిలో ఉన్నారు.
మక్తల్ : సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో జరుగు మోదీ బహిరంగ సభకు మక్తల్ నియోజకవ ర్గం నుంచి వందలాది వాహనాల్లో వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. బీజేపీ జిల్లా నా యకుడు కొండయ్య, మాదిరెడ్డి జలంధర్రెడ్డి మాట్లాడు తూ కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి డబు లింజన్ పాలన ప్రారంభం అవుతుందని ఇక కేసీఆర్ ఫాంహౌజ్కే పరిమితం అవుతాడని వారు జోస్యం చెప్పా రు. బీజేపీ నాయకులు కర్నిస్వామి, దేవరింటి నర్సింహా రెడ్డి, సోమ శేఖర్గౌడ్, కల్లూరి నాగప్ప, బాయికాటి రాజ శేఖర్రెడ్డి, మల్లికార్జున్, చిట్యాల లక్ష్మయ్య, ప్రతాప్రెడ్డి, బీజేవైఎం నాయకులు మంజునాథ్, మహేష్సాగర్, నర్సింహా, రమేష్, పూల శ్రీనివాసులు, రాంమాధవ్, రాజు, అంజనేయులు తరలివెళ్లిన వారిలో ఉన్నారు.
కృష్ణ : హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ ఆధ్వ ర్యంలో నిర్వహించే సంకల్ప బహిరంగ సభకు మండల కేంద్రంతో పాటు తంగడిగి, కున్సీ, గుడెబల్లూర్, ముడు మాల్, చేగుంట, అలంపల్లి గ్రామాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు వాహనాల్లో తరలివెళ్లారు. మజ్గిగ సురేష్, పూజారి లక్ష్మణ, నారాయణభట్, శంకరప్ప, నల్లే నర్సప్ప, సిద్దాలింగారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు వెంకటేష్, శంకరయ్యశెట్టి, నాగేంద్ర, నర్సింగ తరలివెళ్లిన వారిలో ఉన్నారు.
మాగనూరు : హైదరాబాద్లోని సికింద్రాబాద్ జింఖానా పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభకు మాగనూరు మండలం నుంచి బీజేపీ నాయకులు భారీగా తరలివెళ్లారు. మండలాధ్యక్షుడు జయనందరెడ్డి, ఎంపీపీ శ్యామలమ్మ, అశోక్గౌడ్, మల్లేష్, సర్పంచులు నారాయ ణ, తిమ్మప్ప, కార్తీక్, భీమ్రాజు తరలివెళ్లారు.
దామరగిద్ద : హైదరాబాద్లో జరిగే నరేంద్రమోదీ బహిరంగ సభకు దామరగిద్ద మండలం నుంచి బీజీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. మండలాధ్యక్షుడు సత్యనారాయణ, గోపాల్ మాట్లాడుతూ మోదీ నాయక త్వంలో దేశం అభివృద్ధి చెందిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నాయకు లు సంజీవ్గౌడ్, ఆంజనేయులు, నబీ తరలివెళ్లిన వారిలో ఉన్నారు.