రోడ్ల దుస్థితిపై బీజేపీ నిరసన
ABN , First Publish Date - 2020-12-06T05:19:15+05:30 IST
క్షేత్రస్థాయిలో రోడ్లు దారుణంగా ఉన్నాయని, వీటి నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొంటూ శనివారం జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దారుణంగా రోడ్లు
క్షేత్రస్థాయిలో నిరసన తెలిపిన క్యాడర్
క్షేత్రస్థాయిలో రోడ్లు దారుణంగా ఉన్నాయని, వీటి నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొంటూ శనివారం జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు మేరకు గ్రామాల్లో అసంపూర్తిగా, దారుణంగా తయారైన రోడ్ల వద్ద బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తక్షణం రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-ఆంధ్రజ్యోతి బృందం