Dmk పాలనలో పెరిగిన లాకప్ మరణాలు
ABN , First Publish Date - 2022-06-28T18:44:14+05:30 IST
డీఎంకే పాలనలో లాకప్ మరణాలు పెరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఐసిఎఫ్(చెన్నై): డీఎంకే పాలనలో లాకప్ మరణాలు పెరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కన్నియాకుమారి జిల్లా కులశేఖరం సమీపంలో పోలీస్స్టేషన్లో సంతకం చేసేందుకు వెళ్లిన 22 ఏళ్ల అజిత్ అనే యువకుడు పోలీసుల చిత్రహింసల కారణంగా మృతిచెందాడనే వార్త ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ విచారణ జరిపి నిందితులను శిక్షించేలా చర్యలు చేపట్టాలని కోరారు.