బీజేపీ ప్రజా పోరు యాత్రకు మంచి స్పందన

ABN , First Publish Date - 2022-09-28T05:06:03+05:30 IST

బీజేపీ పోరు యాత్రలో వీధి సభలకు ప్రజల నుంచి గొప్ప స్పందన వస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నమట్ల కపర్ది అన్నారు.

బీజేపీ ప్రజా పోరు యాత్రకు మంచి స్పందన
వడలిలో బీజేపీ ప్రజా పోరులో నాయకులు

పెనుగొండ, సెప్టెంబరు 27: బీజేపీ పోరు యాత్రలో వీధి సభలకు ప్రజల నుంచి గొప్ప స్పందన వస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నమట్ల కపర్ది అన్నారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి  దొడ్డిపట్ల నాగూర్‌ ఆధ్వర్యంలో  మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజా పోరు వీధి సభలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ వడలిలో  కార్యక్రమం ప్రారంభించారు. ఇరగవరపు రాధకృష్ణ, పొదల సుమన్‌, వంగూరి రామకృష్ణ, పీతల సత్యనారాయణ, గండ్రో తు నాగేశ్వరరావు, ఏడిద శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


భీమవరం టౌన్‌: రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజాపోరు కన్వీనర్‌ కోమటి రవికుమార్‌, ఆరేటి ప్రకాష్‌, అల్లూరి సాయి దుర్గ రాజు అన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కాయిత సురేంద్ర అధ్యక్షతన పట్టణంలో ప్రకాశంచౌక్‌, మావుళ్ళమ్మ గుడివీధి,కొత్త బస్టాండ్‌, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన సభల్లో వారు మట్లాడారు. అవినీతి పాలనకు చరమ గీతం పాడాల్సిన సమయం అసన్నమైందన్నారు. ఆకుల లీలాకృష్ణ, లంకా లక్ష్మి, అడ్డగర్ల ప్రభాకర గాంధీ, వబిలిశెట్టి ప్రసాద్‌, మోహిద్దీన్‌, అందే త్రిమూర్తులు శేనగవరపు గోవర్ధన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-28T05:06:03+05:30 IST