మణిపూర్‌లో బీజేపీ ఉచితాల వర్షం!

ABN , First Publish Date - 2022-02-18T00:59:22+05:30 IST

మణిపూర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఉచితాల వర్షం కురిపించింది. కాలేజీకి వెళ్లే మెరిట్

మణిపూర్‌లో బీజేపీ ఉచితాల వర్షం!

గువాహటి: మణిపూర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఉచితాల వర్షం కురిపించింది. కాలేజీకి వెళ్లే మెరిట్ అమ్మాయిలకు స్కూటీలు, 12వ తరగతి పాసైన మెరిట్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు మేనిఫెస్టోలో పేర్కొంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిపెస్టోను విడుదల చేశారు. ఆర్థికంగా వెనుకబడిన, బ్యాక్‌వర్డ్ తరగతులకు చెందిన అమ్మాయిలకు రాణి గైడిన్‌లియు నుపి మహేయిరోయ్ సింగి పథకం కింద రూ. 25 వేల ఇన్సెంటివ్‌లు అందిస్తామని, పీఎం ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని బీజేపీ హామీలు గుప్పించింది.

 

అలాగే, సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 200 నెలవారీ పింఛనును రూ. 1000 పెంచుతామని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ఏడాదికి అందిస్తున్న రూ. 6 వేలను రూ. 8 వేలకు పెంచుతామని  పేర్కొంది. రాష్ట్రంలోని జాలర్లకు ఉచితంగా రూ. 5 లక్షల ప్రమాద బీమా, చిన్న, సన్నకారు, భూమి లేని రైతుల పిల్లలు గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో సాంకేతిక విద్యను అభ్యసించేందుకు స్కాలర్‌షిప్‌లు అందిస్తామని వివరించింది. 

Updated Date - 2022-02-18T00:59:22+05:30 IST