మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కు బీజేపీ ప్రణాళిక
ABN , First Publish Date - 2022-07-09T23:41:57+05:30 IST
Hyderabad: కమలం పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కు సిద్ధమవుతోంది. జూలై 10 వ తేదీ పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ అధ్యక్షతన నిర్వహించే కీలక భేటీకి ముఖ్యఅతిథిగా పార్టీ ఇన్ఛార్జ్
Hyderabad: కమలం పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కు సిద్ధమవుతోంది. జూలై 10 వ తేదీ పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ అధ్యక్షతన నిర్వహించే కీలక భేటీకి ముఖ్యఅతిథిగా పార్టీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ హాజరవుతున్నారు. పార్టీలోని వివిధ అధ్యయన కమిటీలతో తరుణ్ చుగ్, బండి సంజయ్ సమావేశమవుతారు. చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్గా ఈటల రాజేందర్ను నియమించారు. ఫైనాన్స్ కమిటీ కన్వీనర్గా జితేందర్రెడ్డి, ప్రజా సమస్యలు - టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయన కమిటీ కన్వీనర్గా అర్వింద్ నియమించారు. జిల్లాల వారీగా చేరికలపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. చేరికలకు తెర తీసి అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్కు చెక్ పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు.