బెంగాల్లో బీజేపీ ‘లక్ష్మీ పూజ’
ABN , First Publish Date - 2020-11-01T10:04:26+05:30 IST
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రజలకు సంస్కృతి పరంగా మరింత దగ్గరయ్యేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ నెల 22వ తేదీన మహాషష్ఠి సందర్భంగా సాల్ట్ లేక్లో దుర్గపూజను తలపెట్టి ప్రధాని మోదీతో ఆన్లైన్లో...
- ఎన్నికల నేపథ్యంలో ఆకట్టుకునే వ్యూహం
కోల్కతా, అక్టోబరు 31: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రజలకు సంస్కృతి పరంగా మరింత దగ్గరయ్యేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ నెల 22వ తేదీన మహాషష్ఠి సందర్భంగా సాల్ట్ లేక్లో దుర్గపూజను తలపెట్టి ప్రధాని మోదీతో ఆన్లైన్లో ప్రారంభింపజేసిన ఆ పార్టీ రాష్ట్ర నేతలు.. అదేచోట శనివారం తొలిసారి ‘లక్ష్మీ పూజ’ను చేపట్టారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, ప్రధాన కార్యదర్శి సాయంతన్ బసు ఉత్తర కోల్కతాలోని కాశీపూర్ ఘాట్లో గంగా హారతి ఇచ్చారు.