తెలంగాణలో కొనసాగుతున్న బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌

ABN , First Publish Date - 2021-02-24T03:23:00+05:30 IST

తెలంగాణలో బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కమలనాథులు వ్యూహాత్మకంగా..

తెలంగాణలో కొనసాగుతున్న బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. కాంగ్రెస్‌ను ఖాళీ చేయడమే కాషాయం పార్టీ టార్గెట్‌గా పెట్టుకున్నారు. అధికార టీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగా 3 రోజ‌లు పాటు తెలంగాణలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ పర్యటించనున్నారు. ఇప్పటిలే నడ్డా సమక్షంలో కూన శ్రీశైలంగౌడ్  బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్ సమక్షంలో కాంగ్రెస్ నేత‌ పాల్వాయి హ‌రీష్ బీజేపీలో చేరారు. ఫిరోజ్ ఖాన్‌ కూడా త్వరలో కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. 25న రాష్ట్ర కార్యాల‌యంలో ప‌దాధికారుల స‌మావేశం జరగనుంది. ఈ సమావేశంలో తరుణ్ చుగ్ పాల్గొన‌నున్నారు. గురువారం నాగార్జునసాగ‌ర్‌లో త‌రుణ్ చుగ్ పర్యటించనున్నారు. హాలియాలో కార్యకర్తలు, నేత‌ల‌తో తరుణ్‌ చుగ్‌ స‌మావేశం నిర్వహించారు.  త‌‌రుణ్ చుగ్ స‌మ‌క్షంలో వివిధ పార్టీల నేత‌లు బీజేపీలో చేరనున్నారు. 


Updated Date - 2021-02-24T03:23:00+05:30 IST