బీజేపీ, విపక్షాల పోటాపోటీ నిరసనలు
ABN , First Publish Date - 2021-12-04T06:45:06+05:30 IST
పార్లమెంట్ ఆవరణలో బీజేపీ, ప్రతిపక్షాలు పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు, నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ....
న్యూఢిల్లీ, డిసెంబరు 3: పార్లమెంట్ ఆవరణలో బీజేపీ, ప్రతిపక్షాలు పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు, నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సస్పెండైన 12 మంది రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేస్తుండగా.. బీజేపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ వారి వద్దకెళ్లారు. రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల అప్రజాస్వామిక చర్యలను ఖండించటానికే వచ్చామని బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. కాగా, ఆ 12 మంది విపక్ష సభ్యులు క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా లేనప్పుడు తాను సయోధ్య కుదర్చలేనని రాజ్యసభలో బీజేపీ పక్ష నేత పీయూష్ గోయల్ అన్నారు.