‘బీజేపీ బలోపేతం కావాలి’

ABN , First Publish Date - 2021-07-26T05:59:26+05:30 IST

బీజేపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర సంపర్క్‌ ప్రముఖ్‌ గాదె శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

‘బీజేపీ బలోపేతం కావాలి’
మాట్లాడుతున్నశ్రీనివాసరావు

 

నాతవరం, జూలై 25 : బీజేపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర సంపర్క్‌ ప్రముఖ్‌ గాదె శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.  నాతవరం మండలంలో ఆదివారం జరిగిన  పార్టీ సమావేశంలో మాట్లాడారు.  రాష్ట్రంలో అమలవుతున్న చాలా పథకాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని చెప్పారు. వీటిపై ప్రజల్లోకి అవ గాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రిపై ఉందన్నారు. పార్టీ మండలశాఖ అధ్యక్షుడు లాలం వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పనుగంటి అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చదరం నాగేశ్వరరావు, ఎర్రినాయుడు, చక్రవర్తి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-26T05:59:26+05:30 IST