మోదీ రోడ్ షోకు బిజెపి Big Plan

ABN , First Publish Date - 2022-06-03T23:30:18+05:30 IST

భారతీయ జనతాపార్టీ జాతీయ సమావేశాలకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. ఈమేరకు కార్యవర్గ భేటీలకు తెలంగాణ బిజెపి నాయకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మోదీ రోడ్ షోకు బిజెపి Big Plan

హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ జాతీయ సమావేశాలకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది.ప్రధానంగా ప్రధాన మంత్రి మోదీ రోడ్ షోను భారీగా సక్సెస్ చేయాలని పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.దీంతో పాటు నగరంలో జరిగే కార్యవర్గ భేటీలకు తెలంగాణ బిజెపి నాయకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ,  కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు రానుండడంతో తెలంగాణ బిజెపి నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పార్టీ వర్గాలు తెలిపాయి. జులై 2, 3న హైటెక్స్ నోవాటెల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల కోసం పార్టీ 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయంచింది. అలాగే హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహణకు కూడా పార్టీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.


బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల టైంను రాజకీయంగా వాడుకునేలా ప్లాన్ చేస్తున్నారు. కార్యకర్తలను గ్రూపులుగా విభజించి సీఎంలు, కేంద్రమంత్రులతో ప్రత్యేక భేటీలు నిర్వహించాలని కూడా పార్టీ నాయకులు భావిస్తున్నారు. తెలంగాణలో బలోపేతమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. రానున్న ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టం చేసి అధికారంలోకి రావాలని పార్టీ భావిస్తోంది.

Updated Date - 2022-06-03T23:30:18+05:30 IST