ఎస్సీలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం

ABN , First Publish Date - 2022-08-06T05:06:28+05:30 IST

రాష్ట్రంలో ఎస్సీలను బలమైన ఆర్థిక శక్తిగా తయారుచేయడమే బీజేపీ లక్ష్యమని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

ఎస్సీలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం
సమావేశంలో ప్రసంగిస్తున్న ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

గుంటూరు (సంగడిగుంట), ఆగస్టు 5: రాష్ట్రంలో ఎస్సీలను బలమైన ఆర్థిక శక్తిగా తయారుచేయడమే బీజేపీ లక్ష్యమని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రస్థాయి ఎస్సీ మోర్చా శిక్షణ తరగతులు స్థానిక హిందూ ఫార్మసీ కళాశాలలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఎస్సీలకు చెందాల్సిన రాష్ట్ర సంక్షేమ పథకాల అమలుపై ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్‌ అవిశ్రాంత పోరాటం చేస్తున్నారన్నారు.  కార్యక్రమంలో ఎస్సీ మోర్చా ఇన్‌చార్జి బిట్రా శివన్నారాయణ, బలరామకృష్ణ, అయ్యాజీ వేమా, ఎస్సీ మోర్చా పూర్వ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, సీనియర్‌ నాయకులు భగవాన్‌దాస్‌, దారా అంబేద్కర్‌, కార్యదర్శి దర్శనపు శ్రీనివాస్‌, ఎస్సీ మోర్చా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-08-06T05:06:28+05:30 IST