బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్కు బెదిరింపు కాల్స్
ABN , First Publish Date - 2020-08-11T23:32:31+05:30 IST
బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్కు పాక్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఆయన పోలీసులకు లిఖి
లక్నో : బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్కు పాక్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఆయన పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనను ఓ బాంబ్ బ్లాస్ట్లో చంపేస్తామంటూ పాక్ నెంబరు నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆయన నివాసంతో పాటు, ఆయన్ను ఓ బాంబ్ బ్లాస్ట్లో పేల్చేస్తామని తీవ్రవాద సంస్థల నుంచి ఎంపీ సాక్షి మహారాజ్కు బెదిరింపు కాల్స్ వచ్చాయని పోలీసులు పేర్కొన్నారు. కశ్మీర్ త్వరలోనే పాకిస్తాన్లో భాగమవుతుందని ఆగంతకులు ఫోన్ లో పేర్కొన్నారని, దీంతో పాటు అయోధ్య రామ మందిర భూమిపూజపై కూడా అసభ్య పదజాలంతో ఫోన్లో మాట్లాడినట్లు సాక్షి మహారాజ్ వెల్లడించారు.