బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌కు పాక్‌ నుంచి బెదిరింపు కాల్స్‌

ABN , First Publish Date - 2020-08-12T07:56:59+05:30 IST

బాంబులతో తన ఇంటిని పేల్చివేసి తనను చంపేస్తామని పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థకు చెందిన వారి నుంచి రెండు సార్లు బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ సదర్‌ కొత్వాలి...

బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌కు పాక్‌ నుంచి బెదిరింపు కాల్స్‌

ఉన్నవో, ఆగస్టు 11: బాంబులతో తన ఇంటిని పేల్చివేసి తనను చంపేస్తామని పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థకు చెందిన వారి నుంచి రెండు సార్లు  బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ సదర్‌ కొత్వాలి పోలీసులకు ఫిర్యా దు చేశారు. కశ్మీర్‌ త్వరలో పాకిస్థాన్‌లో భాగమవుతుందని ఆ వ్యక్తి చెప్పినట్లు పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం భూమి పూజ గురించి అసభ్యపదజాలంతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రధాని, హోం మంత్రి, ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌లను దుర్భాషలాడినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-08-12T07:56:59+05:30 IST