Laxman comments: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయం
ABN , First Publish Date - 2022-08-18T18:25:53+05:30 IST
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయమమని బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో డబుల్ ఇంజిన్ సర్కార్ (Double Engine govenment) ఖాయమని బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ (BJP Parliamentary Board Member), ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith shah) సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని జోస్యం చెప్పారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో తనకు చోటు దక్కటం సామన్య కార్యకర్తకు దక్కిన గౌరవమని తెలిపారు. బీజేపీ వలన కాదు.. ప్రజలు కోరుకున్నందునే మునుగోడుకు ఉప ఎన్నిక (Munugodu by poll) జరుగుతోందన్నారు. భవిష్యత్ లేకనే.. కేంద్రం, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ (KCR) విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికలకు ముందే అధికార టీఆర్ఎస్ (TRS) కాడి పడేసిందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలు మునుగోడు బైపోల్స్లో పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. అమిత్ షా సభకు రాష్ట్రం నలుమూలల నుంచి బీజేపీ శ్రేణులు తరలిరాబోతున్నాయని లక్ష్మణ్ పేర్కొన్నారు.