కరోనాతో బీజేపీ ఎంపీ మృతి
ABN , First Publish Date - 2021-03-03T07:17:14+05:30 IST
కరోనా బారినపడి చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ ఖాండ్వా బీజేపీ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ (69) సోమవారం రాత్రి కన్నుమూశారు
న్యూఢిల్లీ, మార్చి 2: కరోనా బారినపడి చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ ఖాండ్వా బీజేపీ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ (69) సోమవారం రాత్రి కన్నుమూశారు. నందకుమార్కు గత నెలలో పాజిటివ్ వచ్చింది. పరిస్థితి విషమంగా ఉండటంతో విమానంలో గురుగ్రామ్లోని ఆస్పత్రికి తరలించారు. ఈయన ఖాండ్వా నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 1985-96 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నారు.