నిజంగా ఆ ధైర్యం ఉంటే... జగన్ అసెంబ్లీని రద్దు చేయాలి: GVL

ABN , First Publish Date - 2022-07-01T16:30:45+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిజంగా ఆ ధైర్యం ఉంటే... జగన్ అసెంబ్లీని రద్దు చేయాలి: GVL

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy)పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు(GVL narasimaha rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజాకంటక పాలన ఉందని.. జగన్‌ది దుర్మార్గమైన పాలన అని వ్యాఖ్యానించారు. ‘‘వైసీపీకి 175 సీట్లు వస్తాయని, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తామని జగన్ అంటున్నారు. నిజంగా ఆ ధైర్యం ఉంటే.. అసెంబ్లీని రద్దు చేయాలి’’ అంటూ సవాల్ విసిరారు. వైసీపీ ప్లీనరీలో ఈ విషయం ప్రకటించాలని డిమాండ్ చేశఆరు. వైసీపీ అంటే గోల్ మాల్ అని ప్రజలు అనుకుంటున్నారని ఎంపీ జీవీఎల్ అన్నారు. 

Updated Date - 2022-07-01T16:30:45+05:30 IST