రుషికొండ రహస్యం ఏంటి?: ఎంపీ GVL
ABN , First Publish Date - 2022-06-03T18:25:27+05:30 IST
నగరంలోని రుషికొండకు వెళ్లనీయకుండా ప్రభుత్వం అడ్డుకోవడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం: రుషికొండకు వెళ్లనీయకుండా ప్రభుత్వం అడ్డుకోవడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ... ‘‘రుషి కొండకు మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వడం లేదు?.. రుషికొండ రహస్యం ఏంటి?’’ అని ప్రశ్నించారు. పాత హోటల్ ఎంత పరిధిలో ఉందో ఆ మేరకే నిర్మాణం చేయాలని కోర్టులు కూడా స్పష్టంగా చెప్పాయన్నారు. మొత్తం కొండ అంతా తొలిచేసినట్టు ఉన్నారని...అందుకే తమను వెళ్ళనివ్వడం లేదని మండిపడ్డారు. రుషి కొండపై పూర్తి వివరాలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుషికొండకు వెళుతున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వారంతా పార్టీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు.