త్వరలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను ప్రకటించబోతున్నాం: ఎంపీ GVL
ABN , First Publish Date - 2022-06-02T17:53:33+05:30 IST
సీఎం అవినీతిని అరికట్టడానికి ఇచ్చిన ప్రకటన బావుందని.. ఇందులో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు , ప్రజాప్రతినిధుల గురించి ఎందుకు చేర్చలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు.
విశాఖపట్నం: సీఎం జగన్ అవినీతిని అరికట్టడానికి ఇచ్చిన ప్రకటన బావుందని.. ఇందులో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు , ప్రజాప్రతినిధుల గురించి ఎందుకు చేర్చలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు(GVL narasimha rao) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... సౌత్ కోస్ట్ రైల్వే జోన్ త్వరలోనే ప్రకటించబోతున్నామని తెలిపారు. రిషికొండ బ్లూ ఫాగ్ బీచ్లను రేపు సందర్శించనున్నట్లు చెప్పారు. రుషికొండలో నిబంధనలు తుంగలో తొక్కి సెవెన్ స్టార్ హోటల్ ప్రభుత్వ నిర్మాణం చేస్తోందని విమర్శించారు. రుషికొండ నిర్మాణం వెనుక ప్రభుత్వ వైఖరి బయట పెట్టాలని కోరుతున్నామని... లేదంటే రుషికొండపై తాము అన్ని రూపాల్లో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో 6, 7 తేదీల్లో జేపీ నడ్డా(JP nadda), 12 13 తేదీల్లో కేంద్ర మంత్రి జయశంకర్(Jayashankar), జులై 4న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) పర్యటించనున్నట్లు ఎంపీ జీవీఎల్ తెలిపారు.