సీఎం అభ్యర్థిపై మా స్థాయిలో నిర్ణయాలు ఉండవు: GVL

ABN , First Publish Date - 2022-06-06T16:41:42+05:30 IST

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటనతో రాష్ట్ర బీజేపీ క్యాడర్‌లో జోష్ వస్తుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.

సీఎం అభ్యర్థిపై మా స్థాయిలో నిర్ణయాలు ఉండవు: GVL

విజయవాడ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటనతో రాష్ట్ర బీజేపీ క్యాడర్‌లో జోష్ వస్తుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. సోమవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... 2024 ఎన్నికలే లక్ష్యంగా రోడ్ మ్యాప్ సిద్దం చేస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జనసేన, బీజేపీ మైత్రి బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కలిసే ఎన్నికల క్షేత్రంలో దిగుతామన్నారు. సీఎం అభ్యర్థిత్వంపై తమ స్థాయిలో నిర్ణయాలు ఉండవని తెలిపారు. జాతీయ నాయకత్వం చర్చించి ఒక ప్రకటన చేస్తుందన్నారు. సరైన సమయంలో సరైన ప్రకటనలు తమ అధిష్టానం నుండి‌ వస్తాయని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.

Updated Date - 2022-06-06T16:41:42+05:30 IST