రామ మందిర నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన ఎంపీ గంభీర్

ABN , First Publish Date - 2021-01-21T21:36:45+05:30 IST

బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి గురువారం విరాళం ప్రకటించారు. రామ మందిర నిర్మాణానికి తన

రామ మందిర నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన ఎంపీ గంభీర్

న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి గురువారం విరాళం ప్రకటించారు. రామ మందిర నిర్మాణానికి తనవంతుగా కోటి రూపాయలను విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘భవ్య రామ మందిర నిర్మాఱం అనేది భారతీయుల కల. చివరికి ఈ దీర్ఘకాల సమస్యకు ఓ పరిష్కారం లభించింది. ఆలయ నిర్మాణానికి నా వంతుగా, నా కుటుంబం వంతున చిన్న సహాయాన్ని అందజేస్తున్నాం.’’ అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-21T21:36:45+05:30 IST