ఎంపీ Arvindకు చెప్పుల దండ వేసేందుకు TRS యత్నం
ABN , First Publish Date - 2022-07-15T18:03:48+05:30 IST
జిల్లాలో బీజేపీ(BJP) ఎంపీ అరవింద్(Arvind) కాన్వాయ్పై టీఆర్ఎస్(TRS) కార్యకర్తలు దాడి చేశారు.
జగిత్యాల: జిల్లాలో బీజేపీ(BJP) ఎంపీ అరవింద్(Arvind) కాన్వాయ్పై టీఆర్ఎస్(TRS) కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అరవింద్ ఎద్దండికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీ కాన్వాయ్తో పాటు మరో రెండు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కారులో ఉన్న అరవింద్కు చెప్పుల దండ వేసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. భారీ భద్రత నడుమ బీజేపీ ఎంపీ కాన్వాయ్ను అక్కడి నుంచి పంపించివేశారు. వరదల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్న తరుణంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు.