బియ్యం రీ సైక్లింగ్ దందాలో కేటీఆర్: ఎంపీ అరవింద్

ABN , First Publish Date - 2021-12-12T00:41:19+05:30 IST

రాష్ట్రంలో బియ్యం రీ సైక్లింగ్ దందాలో మంత్రి కేటీఆర్

బియ్యం రీ సైక్లింగ్ దందాలో కేటీఆర్: ఎంపీ అరవింద్

నిజామాబాద్: రాష్ట్రంలో బియ్యం రీ సైక్లింగ్ దందాలో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని ఎంపీ అరవింద్  సంచలన ఆరోపణలు చేశారు. వడ్లు, బియ్యంతో కోట్లు దండుకుంటున్నారన్నారు. కొనుగోలు కేంద్రాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు సందర్శించడం లేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. దళిత బంధు పథకం ఏమైందన్నారు. పంట మార్పిడిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో  రైతులు అయోమయంలో ఉన్నారన్నారు. మూతపడిన చెరకు ఫ్యాక్టరీలు తెరిపించాలని డిమాండ్ చేశారు. పంటలకు బోనస్ ప్రకటించాలన్నారు. బాయిల్డ్ రైస్ సప్లై చేయలేమని కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మాట మార్చి రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ధాన్యంలో భారీ ఎత్తున బ్లాక్ మార్కెట్ జరుగుతోందన్నారు. 

Updated Date - 2021-12-12T00:41:19+05:30 IST