బీజేపీ ఎంపీ అనిల్ బలూనీకి కరోనా

ABN , First Publish Date - 2021-04-13T17:45:40+05:30 IST

బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీకి కరోనా సోకింది.....

బీజేపీ ఎంపీ అనిల్ బలూనీకి కరోనా

న్యూఢిల్లీ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీకి కరోనా సోకింది.మంగళవారం తాను కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని,దీంతో తాను క్వారంటైన్ లో ఉన్నానని ఎంపీ అనిల్ చెప్పారు. ప్రజలు కరోనా సోకకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు పాటించాలని ఎంపీ కోరారు. తనను కలిసిన స్నేహితులు కరోనా పరీక్షలు చేయించుకొని, జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ అనిల్ సూచించారు.దేశంలో 1.61 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

Updated Date - 2021-04-13T17:45:40+05:30 IST