‘ప్రభుత్వాన్ని నిలదీశా.. గెలిపిస్తే మళ్లీ నిలదీస్తా..’
ABN , First Publish Date - 2021-03-08T17:14:42+05:30 IST
నిరుద్యోగ సమస్యపై ఎమ్మెల్సీగా శాసనమండలిలో ప్రధానంగా తానే ప్రశ్నించి ప్రభుత్వాన్ని నిలదీశానని
హైదరాబాద్/చాదర్ఘాట్ : రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యపై ఎమ్మెల్సీగా శాసనమండలిలో ప్రధానంగా తానే ప్రశ్నించి ప్రభుత్వాన్ని నిలదీశానని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎన్. రాంచందర్రావు అన్నారు. ఆదివారం ముసారాంబాగ్ ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో పట్టభద్రుల సమావేశం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ ఈసారి పట్టభద్రుల ఎన్నికల్లో తనకు ఎమ్మెల్సీగా మరో అవకాశమిస్తే నిరుద్యోగ సమస్యపై మరోసారి నిలదీస్తానని వెల్లడించారు. పార్టీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మిరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభా్షచందర్, నగర కార్యదర్శి గౌర దేవేందర్, డివిజన్ అధ్యక్షుడు గౌర విజయకాంత్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్ : బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్.రాంచందర్రావును గెలిపించాలని కోరుతూ బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి కందికంటి కన్నాగౌడ్, నాగోలు డివిజన్ అధ్యక్షుడు దండు ప్రదీ్పకుమార్లు ఆదివారం నాగోలు డివిజన్ ఆదర్శనగర్ కాలనీలో ప్రచారం నిర్వహించారు.
కొత్తపేట: ఎంఎల్సీ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యశ్పాల్గౌడ్ పట్టభద్ర ఓటర్లను కోరారు. స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆదివారం ఆయన కొత్తపేట డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కాట దాస్గౌడ్, నాయకులు అవినాష్, వినోద్, తరుణ్ పాల్గొన్నారు.
సరూర్నగర్ : రాష్ట్రంలోని ఉద్యోగులు, నిరుద్యోగులు కలిసి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములుయాదవ్ అన్నారు. ఆదివారం జిల్లెలగూడ, మీర్పేట్లోని పలు ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించి మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి రాంచందర్రావుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. బీజేపీ మీర్పేట్ కార్పొరేషన్ శాఖ అధ్యక్షుడు పెండ్యాల నర్సింహ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్రావును గెలిపించాలని కోరుతూ పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ పట్టభద్రుల ఓటర్లతో ఆదివారం శివ గార్డెన్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, నియోజకరవ్గం బీజేపీ ఇన్చార్జీ కొత్త అశోక్గౌడ్, జిల్లా ప్రధానకార్యదర్శి పొరెడ్డి అర్జున్రెడ్డి, లచ్చిరెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రంగ జంగమయ్యగౌడ్ హాజరయ్యారు.