వ్యాక్సిన్ వేయించుకోండి... ఉచితంగా ఫోన్ రీచార్జ్ చేయించుకోండి!

ABN , First Publish Date - 2021-06-15T17:53:10+05:30 IST

ప్ర‌జ‌లంతా క‌రోనా వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని...

వ్యాక్సిన్ వేయించుకోండి... ఉచితంగా ఫోన్ రీచార్జ్ చేయించుకోండి!

భోపాల్: ప్ర‌జ‌లంతా క‌రోనా వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని ప్ర‌భుత్వాలు కోరుతున్నవేళ‌... ఇందుకు మ‌ద్ద‌తుగా ఆ ఎమ్మెల్యే చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ అభినందిస్తున్నారు.  తన అసెంబ్లీ నియోజక వర్గంలో కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించడానికి పంచాయతీలకు రూ.20 లక్షలు ప్రకటించిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు ఖత్రి మ‌రో ప్రకటన చేశారు. జూన్ ౩౦ నాటిక‌ల్లా వ్యాక్సిన్ వేయించుకున్న‌ గ్రామస్థుల మొబైల్‌ ఫోన్ల‌కు రీఛార్జ్ చేయించ‌నున్న‌ట్లు ప్రకటించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజధాని భోపాల్‌లోని బెర్సియాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణు ఖత్రి తన అసెంబ్లీ నియోజక వర్గంలో కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించడానికి ముమ్మ‌ర‌ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా తొలుత వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న ఏ పంచాయతీకైనా రూ.10 లక్షలు, రెండో ర్యాంక్ పంచాయతీకి రూ. 7 లక్షలు, మూడో ర్యాంక్ పంచాయతీకి రూ. 3 లక్షలు ఇస్తానని ఇటీవల ప్రకటించారు. దీనికి ఆశించినంత స్పంద‌న రాక‌పోవ‌డంతో ఈ తాజా ప్ర‌క‌ట‌న చేశారు. 

Updated Date - 2021-06-15T17:53:10+05:30 IST