దేశవ్యాప్తంగా పండుగలా కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ: రాజాసింగ్

ABN , First Publish Date - 2021-01-16T18:39:03+05:30 IST

కరోనా వ్యాక్సిన్ టీకాను దేశ ప్రధాని నరేంద్రమోదీ లాంచనంగా ప్రారంభించారని...

దేశవ్యాప్తంగా పండుగలా కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ: రాజాసింగ్

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ టీకాను దేశ ప్రధాని నరేంద్రమోదీ లాంచనంగా ప్రారంభించారని... ఈ టీకా కార్యక్రమాన్ని నేడు దేశ వ్యాప్తంగా ఒక పండుగగా కొనసాగుతోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శనివారం ఉస్మానియా ఆసుపత్రి, ఈఎన్టీ ఆసుపత్రి, కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రులలో మొదటి కొవిడ్ షీల్డ్, కోవ్యాగ్జిన్ ప్రారంభానికి హాజరైన ఎమ్మెల్యే రాజాసింగ్ మొదటి టీకాను ఈఎన్టీ ఆసుపత్రి సుపెరడెంట్ డాక్టర్ శంకర్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా రాజసింగ్ మాట్లాడుతూ.. ఒక సంవత్సరం పాటు కరోనా మహమ్మరితో దేశం అతలాకుతలం అయిందని అన్నారు. దేశ ప్రజలను రక్షించుకోవడానికి ఈ టీకాలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. ఎవరు కూడా ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకొచ్చి టీకాలను తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. 

Updated Date - 2021-01-16T18:39:03+05:30 IST