స్పీకర్ మాటల్లో భయం కనిపించింది: Rajasingh

ABN , First Publish Date - 2022-03-15T19:54:17+05:30 IST

అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాటల్లో భయం కనిపించిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

స్పీకర్ మాటల్లో భయం కనిపించింది: Rajasingh

హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాటల్లో భయం కనిపించిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. స్పీకర్‌తో భేటీ తర్వాత ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ స్పీకర్‌ను ఎంత టార్చర్ పెడుతున్నారో అర్థం అవుతుందని వ్యాఖ్యలు చేశారు. పోడియం దగ్గరకు రాని.‌. ఈటల, రఘునందనరావులను సస్పెండ్ చేయటం అన్యాయమన్నారు. సీఎం కేసీఆర్ ప్లాన్‌ను స్పీకర్ అమలు చేశారని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు గొడవ చేసినా సస్పెండ్ చేయలేదని తెలిపారు. నిజాంలు ఎంత దౌర్జన్యం చేశారో ఇప్పుడూ కేసీఆర్ అదే చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల రక్తం తాగుతోన్న కేసీఆర్‌ను దించుతామని హెచ్చరించారు. ఈటల వస్తే కేసీఆర్ చేసిన పాపాలు బయటపెడతారనే సభలోకి రానివ్వడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-03-15T19:54:17+05:30 IST