టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రాజాసింగ్ ఆగ్రహం
ABN , First Publish Date - 2021-01-21T22:38:51+05:30 IST
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అయోధ్యలో రామాలయం నిర్మాణం ప్రతి హిందువు
హైదరాబాద్: కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అయోధ్యలో రామాలయం నిర్మాణం ప్రతి హిందువు కల. రామ మందిరాన్ని కట్టేందుకు అనేక మంది ముందుకొచ్చారు. ప్రతి హిందువును భాగస్వామ్యం చేయాలని నిధి సేకరిస్తున్నాం. కలెక్షన్లు చేస్తున్నారు.. ఒక్క రూపాయి ఇవ్వొద్దని ఎమ్మెల్యే అనడం సిగ్గుచేటు. ఎమ్మెల్యే విద్యాసాగర్రావు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆలయ నిర్మాణ నిధి కోసం ఎవరిని ఒత్తిడి చేయడం లేదు’ అని రాజాసింగ్ తెలిపారు.