టీఆర్ఎస్‌కు బీ-టీంగా కాంగ్రెస్: రఘునందన్‌రావు

ABN , First Publish Date - 2021-06-26T01:36:25+05:30 IST

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు బీ-టీంగా కాంగ్రెస్ పనిచేయబోతోందని బీజేపీ ఎమ్మెల్యే

టీఆర్ఎస్‌కు బీ-టీంగా కాంగ్రెస్: రఘునందన్‌రావు

 హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు  బీ-టీంగా కాంగ్రెస్ పనిచేయబోతోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఓట్ల బదలాయింపు కోసమే కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని రఘునందన్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారన్న వీ.హెచ్‌ మాటలు నిజమయ్యాయని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ తన చుట్టూ రాక్షసులను ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ ఒక్కరితోనే తెలంగాణ రాలేదని బాల్క సుమన్ గుర్తుంచుకోవాలని రఘునందన్‌రావు హితవు పలికారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదన్నారు. ఓటమి భయంతోనే ఈటల పేరుతో తప్పుడు లేఖల వస్తున్నాయని రఘునందన్‌రావు అన్నారు. 



Updated Date - 2021-06-26T01:36:25+05:30 IST