నా అంచనా ప్రకారం ఇదే చివరి బడ్జెట్: Raghunandan rao

ABN , First Publish Date - 2022-02-25T19:55:44+05:30 IST

త్వరలో జరిగే రాష్ట్ర బడ్జెట్‌లో 119 నియోజకవర్గాలకు సమానంగా నిధులు కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

నా అంచనా ప్రకారం ఇదే చివరి బడ్జెట్: Raghunandan rao

సిద్దిపేట: త్వరలో జరిగే రాష్ట్ర బడ్జెట్‌లో 119 నియోజకవర్గాలకు సమానంగా నిధులు కేటాయించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ... పాలకవర్గానికి ప్రతిపక్షాలకు నిధులలో వివక్ష చూపడం దురదృష్టకరమన్నారు. గత బడ్జెట్ లో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఆచరణలో పెట్టలేదని విమర్శించారు. మూడేళ్ల నుంచి ఆగిపోయిన పెన్షన్, 57ఏళ్లకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. మ్యానిఫెస్టో ప్రకారం బడ్జెట్ ఉండాలని అన్నారు. ‘‘నా అంచనా ప్రకారం ఇదే చివరి బడ్జెట్’’ అని వ్యాఖ్యానించారు. 2018లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-02-25T19:55:44+05:30 IST