గౌరవెల్లి నుంచి ప్రగతి భవన్‌కు పాదయాత్ర: ఎమ్మెల్యే రఘునందన్

ABN , First Publish Date - 2022-01-13T23:13:06+05:30 IST

ఫిబ్రవరి రెండోవారంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ నుంచి పాదయాత్ర ద్వారా

గౌరవెల్లి నుంచి ప్రగతి భవన్‌కు పాదయాత్ర: ఎమ్మెల్యే రఘునందన్

హుస్నాబాద్: ఫిబ్రవరి రెండోవారంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ నుంచి పాదయాత్ర ద్వారా ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌కు నిర్వాసితుల సమస్యలు విన్నవిస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. గౌరవెల్లిలో భూనిర్వాసితులతో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్యలపై సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీలో నిలదీస్తాంమని ఆయన ప్రకటించారు. కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ చేశారని ఆయన ఆరోపించారు. నిర్వాసితులపై  పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం అమానుషమని ఆయన పేర్కొన్నారు. ఓట్ల కోసమే దళితబంధు పథకాన్ని తీసుకువచ్చి హుజురాబాద్ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు.  


Updated Date - 2022-01-13T23:13:06+05:30 IST