రాష్ట్రంలో పక్షపాతం లేకుండా ప్రభుత్వ పథకాలు

ABN , First Publish Date - 2022-04-26T18:20:55+05:30 IST

పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ జిల్లాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారని బీజేపీ సభ్యుడు నయినార్‌ నాగేంద్రన్‌ కొనియాడారు. సోమవారం జరిగిన

రాష్ట్రంలో పక్షపాతం లేకుండా ప్రభుత్వ పథకాలు

                           - సీఎంపై బీజేపీ సభ్యుడి ప్రశంస 


అడయార్‌(చెన్నై): పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ జిల్లాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారని బీజేపీ సభ్యుడు నయినార్‌ నాగేంద్రన్‌ కొనియాడారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు మాట్లాడుతూ, తిరునెల్వేలి జిల్లాలో అనేక అభివృద్ధి పథకాలను ముఖ్యమంత్రి ప్రకటించడం చాలా మంచి విషయమన్నారు. పార్టీలకు అతీతంగా జిల్లాల అభివృద్ధికి పథకాలు ప్రకటిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా తిరునెల్వేలి జిల్లాకు అనేక పథకాలను ప్రకటించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లాలోని అప్పర్‌ ఆలయానికి రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌ బాబు రూ.30 కోట్ల అభివృద్ధి పనులు ప్రకటించారు. అలాగే, రహదారులశాఖ మంత్రి కూడా పలు రహదారుల నిర్మాణానికి ఆదేశాలు జారీచేశారన్నారు. అలాగే, ఆదిచ్చనల్లూరు పరిశోధనా కేంద్రాన్ని రూ.18 కోట్లతో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సభలో ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌ తెలిపారు.

Updated Date - 2022-04-26T18:20:55+05:30 IST