టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతది:ఈటల
ABN , First Publish Date - 2021-12-11T22:53:20+05:30 IST
రాష్ట్రంలోని రైతుల ఉసురు తగిలి టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతదని బీజేపీ ఎమ్మెల్యే
మెదక్: రాష్ట్రంలోని రైతుల ఉసురు తగిలి టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. జిల్లాలోని హవేళిఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్ ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్రావు, పరామర్శించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో మోతబారి రైతునని చెప్పుకునే సీఎం కేసీఆర్ రైతులు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదన్నారు. రైతులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. వరి పంట వేయొద్దని సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు. వానాకాలం పంటలో రా రైస్ మాత్రమే ఉంటుందన్నారు. బియ్యం తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
వర్షాకాలం వడ్లన్నీ వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యాసంగిలో వచ్చే పంటపై రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. రైతుల ఉసురుతో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. టీఆర్ఎస్ మొసలి కన్నీటిని రైతులు నమ్మొద్దన్నారు. రైతాంగానికి బీజేపీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఈటల పేర్కొన్నారు. రవి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.50 వేలను అందజేశారు.