టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే, కౌన్సిలర్

ABN , First Publish Date - 2021-08-31T21:31:26+05:30 IST

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వజిత్ దాస్ మాట్లాడుతూ ‘‘కొన్ని అపార్థాల వల్ల జరగకూడని పనులు జరిగిపోయాయి. ప్రస్తుతం నేను నా ఇంటికి తిరిగి వచ్చాను. నా రాష్ట్రం కోసం, నా ప్రజల కోసం

టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే, కౌన్సిలర్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి భారీగా వలసలు కొనసాగాయి. అయితే ఫలితాల అనంతరం సీన్ రివర్స్ అయింది. అత్యధిక మెజారిటీతో గెలిచి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్న టీఎంసీలోకి బీజేపీ నుంచి వలసలు ప్రారంభై నేటికీ కొనసాగుతున్నాయి. తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, ఒక కార్పొరేటర్ తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలోని బాగ్దా అసెంబ్లీ నియోజకవర్గ సభ్యుడు విశ్వజిత్ దాస్‌, కౌన్సిలర్ మనోతోష్ నాథ్ మంగళవారం కోల్‌కతాలోని టీఎంసీ కార్యాలయంలో పార్టీలో అధికారికంగా చేరారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వజిత్ దాస్ మాట్లాడుతూ ‘‘కొన్ని అపార్థాల వల్ల జరగకూడని పనులు జరిగిపోయాయి. ప్రస్తుతం నేను నా ఇంటికి తిరిగి వచ్చాను. నా రాష్ట్రం కోసం, నా ప్రజల కోసం, నా నియోజకవర్గం కోసం ఇక నుంచి మరింత సమర్థవంతంగా పని చేస్తాను’’ అని అన్నారు.

Updated Date - 2021-08-31T21:31:26+05:30 IST