కొనసాగుతున్న BJP కార్యవర్గ సమావేశాలు

ABN , First Publish Date - 2021-11-26T19:14:19+05:30 IST

బీజేపీ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‌అధ్యక్షతన మహవీర్ కళాశాలలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.

కొనసాగుతున్న BJP కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్: బీజేపీ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‌అధ్యక్షతన మహవీర్ కళాశాలలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రైతుల సమస్యలు, హుజురాబాద్ ఉప‌ ఎన్నిక విజయం, నిరుద్యోగ మిలియన్ మార్చ్, రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత విషయాలు, భవిష్యత్ కార్యాచరణపై బీజేపీ కార్యవర్గం పలు తీర్మానాలు చేయనుంది. ఈ సమావేశాల్లో తరుణ్ చుగ్, డీకే అరుణ, విజయశాంతి, లక్ష్మణ్, రాజసింగ్, రాష్ట్ర స్థాయి నేతలు, ప్రధాన కార్యదర్శులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-26T19:14:19+05:30 IST